Webdunia News
 
  ప్రధాన వార్తలు
  అంతర్జాతీయ
  జాతీయ
  వాణిజ్య
  క్రీడా
  వినోదం
  ఇతర
 ప్రధాన వార్తలు
కాంగ్రెస్‌కు నష్టం లేదు : వైఎస్
Webdunia9 గంటల క్రితం
పలు పార్టీలు పొత్తులతో ఏకమైనా, కాంగ్రెస్ పార్టీకి ఏ మాత్రం నష్టం లేదని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి ధిమా వ్యక్తం చేశారు. గురువారం రాజమండ్రిలో ఆయన మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ కొత్తగా ఎన్ని పార్టీలు వచ్చినా తమ పార్టీకి ఏ మాత్రం ఢోకా లేదని ఆయన ఆభిప్రాయపడ్డారు.తాము చేపట్టని అభివృద్ధి పనులు లేదని, కొత్తగా రాజకీయాల్లోకి వచ్చేవారు చేసేది ఎమీలేదని సీఎం వ్యాఖ్యానించారు. కొన్ని పార్టీలు పొత్తుల కోసం సిద్ధాంతాలను వదులుకొంటున్నాయని ఆయన విమర్శించారు. తమ ప్రభుత్వం రాజీవ్ గృహకల్పన, ఇందిరమ్మ గృహకల్పనల...
పాక్ లో రెండు బాంబు పేలుళ్ళు ...15మంది మృతి
Oneindia11 గంటల క్రితం
ఇస్లామాబాద్: వరసగా జరుగుతున్న బాంబు పేలుళ్ళతో పాకిస్ధాన్ ప్రజలకు కంటి మీద కునుకు కరవైంది. రెండు రోజుల క్రితం జరిగిన ఆత్మాహుతి దాడితో పదుల సంఖ్యలో ప్రజలు ప్రాణాలు కోల్పోయారు. ఈ రోజు కూడా ఇస్లామాబాద్ సమీపంలోని వాహ్ కంటోన్మెంట్ ప్రాంతంలో రెండు బాబు పేలుళ్ళు జరిగాయి. ఈ ఘటనలో 15 మంది ప్రాణాలు కోల్పోయారు. 40 మంది కి గాయాలయ్యాయి. రావుల్పిండి కంటోన్మెంట్ ప్రాంతంలోని ఆర్డినెన్స్ ఫాక్టరీ బయిట ఇద్దరు వ్యక్తుల ఆత్మాహుతి దాడికి పాల్పడటంతో చాలామంది అక్కడకక్కడే నేలకొరిగారని ప్రత్యక్ష్య సాక్షుల కథనం.
రాష్ట్ర రాజధానిలో సిమి కార్యకర్త అరెస్టు
Webdunia9 గంటల క్రితం
రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌లో సిమి (స్టూడెంట్ ఇస్లామిక్ మూవ్‌మెంట్ ఆఫ్ ఇండియా)కు చెందిన సయ్యద్ అహ్మద్ హుస్సేన్‌ అనే కార్యకర్తను పోలీసులు గురువారం అరెస్టు చేశారు. బెంగళూరు, అహ్మదాబాద్ పేలుళ్లలో అహ్మద్ ప్రమేయమున్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.భాగ్యనగరంలోని సైదాబాద్‌లో నివాసముంటున్న అహ్మద్ ఓ కాల్‌సెంటర్‌లో పనిచేస్తున్నాడు. గతంలో ఐఎస్ఐ కార్యకర్తగా ఉన్న అహ్మద్ సిమిలో పని చేస్తున్నాడు. బెంగళూరు-గుజరాత్ వరుస బాంబు పేలుళ్లకు అహ్మద్‌కు గల ప్రమేయంపై పోలీసులు విచారణ జరుపుతున్నారు.ఇదిలా ఉండగా, అహ్మదాబాద్ బాంబు...
 అంతర్జాతీయ
ఆత్మాహుతి దాడితో దద్దరిల్లిన పాక్ : 12 మంది మృతి
Webdunia12 గంటల క్రితం
పాకిస్తాన్ రాజధాని ఇస్లామాబాద్‌ సమీపంలో టాక్సిలాలో గురువారం ఆత్మాహుతి బాంబు పేలుళ్లు సంభవించాయి. ఈ పేలుళ్లలో 12మంది మరణించారు. టాక్సికా పట్టణంలోని సైనిక ఆయుధ కర్మాగారాన్ని లక్ష్యం చేసుకుని ఈ పేలుళ్ల సంభవించాయని పోలీసులు వెల్లడించారు. ఇద్దరు ఆత్మాహుతి బాంబర్ల కర్మాగారం ముందు తమను తాము పేల్చుకున్నారని, కార్మికులు సిఫ్ట్ మారే సమయంలో ఈ బాంబు పేలుడు జరిగిందని పోలీసులు తెలిపారు.ఈ బాంబు పేలుళ్లలో గాయాలకు గురైన వారిని సమీపంలోని ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారని పోలీసు ఉన్నతాధికారి నసీర్ దురాని వెల్లడించారు.
పాక్‌ సంకీర్ణానికి షరీఫ్ తాజా హెచ్చరిక
Webdunia14 గంటల క్రితం
పాకిస్థాన్‌ సంకీర్ణ ప్రభుత్వానికి ఆ దేశ మాజీ ప్రధాని, పాకిస్థాన్ ముస్లిం లీగ్ (ఎన్) అధినేత నవాజ్ షరీఫ్ మరో హెచ్చరిక చేశారు. వచ్చే శుక్రవారం లోగా తొలగింపునకు గురైన సుప్రీం కోర్టు న్యాయమూర్తులను తిరిగి నియమించాలని ఆయన డెడ్‌లైన్ విధించారు. అలాకానీ పక్షంలో సంకీర్ణ ప్రభుత్వం నుంచి వైదొలగనున్నట్టు ఆయన ప్రకటించారు. ఈ విషయాన్ని వాల్‌స్ట్రీట్ జర్నల్ వార్తా పత్రిక పేర్కొంది.షరీఫ్ తాజాగా విధించిన డెడ్‌లైన్ సంకీర్ణ పార్టీలో ఉన్న అభిప్రాయబేధాలు మరో మారు బహిర్గతమయ్యాయి. గత ఏడాది ముషారఫ్ న్యాయమూర్తులను తొలగించడం...
స్పెయిన్‌లో విమాన ప్రమాదం: 153 మంది మృతి
Webdunia15 గంటల క్రితం
స్పెయిన్‌లో ఘోర విమాన ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో 153 మంది దుర్మరణం పాలైనట్టు స్పెయిన్ ప్రభుత్వం ప్రకటించింది. స్పెయిన్‌లోని మాడ్రిడ్ విమానాశ్రయంలో ఈ ప్రమాదం జరిగింది. మొత్తం 172 మంది ప్రయాణికులతో ఉన్న స్పాన్‌ఎయిర్ ఎయిర్‌లైన్స్ విమానం బుధవారం మాడ్రిడ్ విమానాశ్రయంలో టేకాఫ్ అవుతుండగా ప్రమాదవశాత్తూ కూలిపోయింది.దీంతో విమానానికి నిప్పంటుకుందని విమానాశ్రయ అధికారులు తెలిపారు. ఈ ప్రమాదంలో మరణించిన వారిలో ఎక్కువ మంది చిన్నపిల్లలేనని వారు తెలిపారు. అయితే.. 19 మంది ప్రయాణికులను రక్షించగలిగినట్టు, వీరిని...
 జాతీయ
పగ్గాలు లేని ద్రవ్యోల్బణం: 12.63% చేరిక
Webdunia8 గంటల క్రితం
సామాన్యుడి బతుకుబండి మెడలో మరోసారి ద్రవ్యోల్బణం గుదిబండ పడింది. కూరగాయలు, పండ్లు ధరలు విపరీతంగా పెరిగిపోవడంతో ద్రవ్యోల్బణం క్రమంగా పైకి దూసుకెళుతోంది. ఆగస్టు 16వ తేదీతో ముగిసే వారానికి 12.63 శాతంగా నమోదైంది.గత వారంలో 12.44 శాతం ఉన్న ద్రవ్యోల్బణం ప్రస్తుత వారానికి 0.19 శాతం మేర పెరిగింది. కాగా గత ఏడాది ఇదే వారానికి 4.24 శాతం ఉన్న ద్రవ్యోల్బణం క్రమంగా పెరుగుతూ నేడు ఈ స్థాయికి చేరింది.ధరలను అదుపు చేయడానికి కేంద్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు ఫలించలేదని తెలుస్తోంది. నూలు, టీ, పప్పుదినుసులు, సిమెంట్...
బీహార్‌లో ఎన్‌కౌంటర్ : 8మంది మృతి
Webdunia10 గంటల క్రితం
బీహార్‌లో పోలీసులకు మావోయిస్టులకు మధ్య జరిగిన ఎన్‌కౌంటర్‌లో ఐదుగురు పోలీసులతో సహా ముగ్గురు సాధారణ పౌరులు మరణించారు. మావోయిస్టులపై పోలీసులు జరిపిన దాడి భీకర పోరుగా మారిందని, ఇరు వర్గాల మధ్య దాడులు ఉద్రిక్తతను సృష్టించిందని పోలీసులు వెల్లడించారు.గయా జిల్లాలోని రాణి గంజ్ పంజాబ్ నేషనల్ బ్యాంకులో నిషిద్ధ మావోయిస్టులు ఉన్నారని వచ్చిన సమాచారంలో పోలీసులు ఆ బ్యాంకును చుట్టిముట్టారని, దీనిని పసిగట్టిన మావోలు విచక్షణారహితంగా కాల్పులు జరిపినట్లు పోలీసు ఉన్నతాధికారిక వర్గం వెల్లడించింది. ఈ కాల్పుల్లో ముగ్గురు...
పీవీ ప్రభుత్వంపై అద్వానీ ప్రశంసల జల్లు
Webdunia18 గంటల క్రితం
భారతీయ జనతా పార్టీ అగ్రనేత ఎల్కే.అద్వానీ ఏ క్షణంలో ఎలాంటి వ్యాఖ్యలు చేస్తారో ఎవరికీ అంతుచిక్కదు. గతంలో పాక్ జాతిపిత మహ్మద్ జిన్నాను పొగడ్తల వర్షంలో ముంచెత్తి వివాదంలో చిక్కుకున్నారు. తాజాగా 1990 నాటి మాజీ ప్రధాని పీవీ.నరసింహారావు పాలనపై ప్రశంసల జల్లు కురిపించారు. పీవీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన సరళీకరణ విధానాల మూలంగానే దేశం ‘ఆత్మన్యూనత’ను అధిగమించిందన్నారు.దేశం ఆర్థికంగా అగ్రగామిగా నిలిచేందుకు ఇప్పటికీ పాలనాజాప్యం అడ్డుగా నిలుస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. బ్రిటిష్‌ పాలన మనలో ఆత్మన్యూనతను నింపింది.
 వాణిజ్య
భారీగా క్షీణించిన స్టాక్ మార్కెట్
Webdunia11 గంటల క్రితం
స్టాక్ మార్కెట్ గురువారం భారీగా క్షీణించడంతో బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ సూచీ సెన్సెక్స్ 434 పాయింట్లు పడిపోయి 14,244 వద్దకు చేరింది. అలాగే నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ నిఫ్టీ 132 పాయింట్లు నష్టపోయి 4284 వద్ద ముగిసింది.ఉదయం సెన్సెక్స్ 31 పాయింట్లు నష్టంతో స్టాక్ మార్కెట్ ప్రారంభమైంది. దీంతో సాయంత్రం ట్రేడింగ్ ముగిసే సమయానికి మొత్తం 2,713 కంపెనీల వాటాలు ట్రేడింగ్ అవ్వగా 1,915 కంపెనీల వాటాలు నష్టాలను చవిచూశాయి. అలాగే 733 కంపెనీల వాటాలు లాభపడగా.. మిగిలిన కంపెనీల వాటాలు స్థిరంగా నిలిచాయి.ఎస్‌బీఐ, హెచ్‌డీఎఫ్‌సీ...
క్షీణిస్తున్న సెన్సెక్స్
Webdunia14 గంటల క్రితం
స్టాక్ మార్కెట్ గురువారం నష్టాల్లో పయనిస్తుండటంతో బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ సూచీ సెన్సెక్స్ 282 పాయింట్లు క్షీణించి 14,396 వద్ద పయనిస్తోంది. అలాగే నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ నిఫ్టీ 96 పాయింట్లు పెరిగి.. 4,320 వద్ద కొనసాగుతోంది.ఎస్‌బీఐ, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్, హెచ్‌డీఎఫ్‌సీ, ఎన్టీపీసీ, డీఎల్ఎఫ్, బీహెచ్ఈఎల్, జైప్రకాశ్ అసోసియేట్స్, రిలయన్స్ ఇన్‌ఫ్రా, హిందుస్థాన్ యునిలివర్, ఓఎన్‌జీసీ, రిలయన్స్ కమ్యూనికేషన్స్, గ్రాసిం, ఎల్అండ్‌టీ తదితర సంస్థల వాటాలు నష్టాల్లో పయనిస్తున్నాయి.ఇప్పటివరకు మొత్తం...
నష్టాల బాటలో సెన్సెక్స్
Webdunia16 గంటల క్రితం
స్టాక్ మార్కెట్ గురువారం నష్టాల బాటలో పయనిస్తుండటంతో బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ సూచీ సెన్సెక్స్ 185 పాయింట్లు క్షీణించి 14,493 వద్ద పయనిస్తోంది. అలాగే నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ నిఫ్టీ 20 పాయింట్లు పడిపోయి 4,396 వద్ద కొనసాగుతోంది.గ్రాసిం, ఎన్టీపీసీ, జైప్రకాశ్ అసోసియేట్స్, హెచ్‌డీఎఫ్‌సీ, ఎస్‌బీఐ, రిలయన్స్ ఇన్‌ఫ్రా తదితర సంస్సథల వాటాలు నష్టాల్లో పయనిస్తుండగా టాటా మోటార్స్ తదితర సంస్థల వాటాలు లాభాల్లో కొనసాగుతున్నాయి.
 క్రీడా
ఒలింపిక్ స్వర్ణం నా లక్ష్యం : విజేందర్
Webdunia11 గంటల క్రితం
బీజింగ్ ఒలింపిక్ బాక్సింగ్ పోటీల్లో సెమీ ఫైనల్‌కు చేరుకోవడం ద్వారా పతకాన్ని ఖాయం చేసుకున్న విజేందర్ స్వర్ణ పతకమే తన లక్ష్యం అని పేర్కొంటున్నాడు. భారత్ తరపున బాక్సింగ్ సెమీస్‌లోకి ప్రవేశించిన విజేందర్ స్వర్ణం గెల్చుకోవడంపైనే తాను దృష్టి పెట్టానని తెలిపాడు.క్వార్టర్స్ విజయం అనంతరం విజేందర్ మాట్లాడుతూ క్వార్టర్స్‌లో గెలవడానికి తాను ఎంత పట్టుదల ప్రదర్శించానో సెమీ ఫైనల్‌లో సైతం అదే పట్టుదల ప్రదర్శిస్తానని పేర్కొన్నాడు. సెమీస్‌లో ప్రత్యర్ధి గురించి వారి బలాల గూర్చి తాను ఆలోచించడం లేదని సెమీస్‌లో విజయం...
యూఎస్ ఓపెన్‌కు సానియా దూరం
Webdunia12 గంటల క్రితం
మణికట్టు గాయం కారణంగా టెన్నిస్ సంచలనం సానియా మీర్జా అమెరికా ఓపెన్‌కు దూరమైంది. గాయం కారణంగా తాజా ఒలింపిక్ నుంచి మధ్యలోనే నిష్క్రమించిన సానియా యూఎస్ ఓపెన్ నుంచి కూడా నిష్క్రమించడం గమనార్హం.మీడియాకు విడుదల చేసిన ప్రకటన ప్రకారం కుడిచేతి గాయం కారణంగా సోమవారం నుంచి ప్రారంభం కానున్న అమెరికా ఓపెన్‌లో పాల్గొనబోవడం లేదని సానియా పేర్కొంది. వైద్యుల సూచన మేరకు మూడు వారాల విశ్రాంతి అవసరమైన కారణంగా ఈ టోర్నీ నుంచి తాను తప్పుకుంటున్నట్టు సానియా తన ప్రకటనలో పేర్కొంది.ఈ విషయమై సానియా మాట్లాడుతూ గాయం కారణంగా టోర్నీలో...
ఒలింపిక్ బీచ్ వాలీబాల్ : అమెరికాకు స్వర్ణం
Webdunia13 గంటల క్రితం
ఒలింపిక్ మహిళల బీచ్ వాలీబాల్ పోటీల్లో అమెరికా జట్టు స్వర్ణ పతకం గెల్చుకుంది. బీజింగ్‌లో గురువారం జరిగిన ఈ పోటీలో చైనా జట్టును ఖంగు తినిపించి అమెరికా స్వర్ణాన్ని ఎగరేసుకుపోయింది.రెండు రౌండ్లలో జరిగిన ఫైనల్ పోటీలో 21-18 తేడాతో చైనా జట్టుపై అమెరికా జట్టు గెలుపొందింది. తొలి రౌండ్ నుంచే అమెరికాకు చెందిన కెర్రీ వాల్స్, మిస్టిమై జంట చైనాకు చెందిన జీ-వాంగ్, జియాంగ్ డియాన్ జంటపై పూర్తి ఆధిపత్యం ప్రదర్శించింది. దీంతో రెండు రౌండ్లు ముగిసే సరికి 21-18 తేడాతో ముందంజ వేసిన అమెరికా స్వర్ణాన్ని చేజిక్కించుకుంది...
 వినోదం
"బ్యాంక్" సినిమా ట్రైలర్‌ను వీక్షించండి
Webdunia11 గంటల క్రితం
అరుణ్ ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై స్వీయ నిర్మాణంలో వి. అరుణ్ కుమార్ రూపొందించిన చిత్రం ‘బ్యాంక్’. ఈ సినిమాలో జాకీష్రాఫ్, రఘువరన్, రాహుల్‌దేవ్, అబ్బాస్, అర్చన ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు.ఈ సినిమా గురించి జాకీష్రాఫ్ మాట్లాడుతూ.. తాను చేసిన తొలి తెలుగు సినిమా "అస్త్రం" అని, ఆ తర్వాత అరుణ్ ఈ స్క్రిప్టుని వినిపించగానే బాగా నచ్చి, వెంటనే అంగీకరించానని చెప్పారు. రాహుల్‌దేవ్ చక్కని నటుడని, అర్చన ఈ సినిమాలో బాగా చేసిందని తెలిపారు. అబ్బాస్ తన పాత్రకు న్యాయం చేశారని, ఈ సినిమాలో బ్యాంక్ దోపిడీలనీ ప్లాన్ చేసే...
సౌదీలో సల్మాన్ఖాన్ సినిమాపై నిషేధం!
Oneindia11 గంటల క్రితం
బాలీవుడ్ నటుడు సల్మాన్‌ఖాన్ తాజా చిత్రం 'గాడ్ తుస్సే గ్రేట్ హో'పై సౌదీలో నిరసనలు వ్యక్తమవుతున్నాయి. ఈ చిత్రంలో ఇస్లాం మత బోధనలు ఉల్లంఘించినట్టు ఫిర్యాదులు వెల్లువెత్తాయి. దీంతో ఈ చిత్ర ప్రదర్శనకు అడ్డంకులు ఆరంభమయ్యాయి. తాజాగా.. సౌదీ అరేబియా ప్రభుత్వం చిత్ర ప్రదర్శనకు బ్రేక్‌ వేసింది. ప్రేక్షకుల నుంచి లెక్కకుమించి ఫిర్యాదులు అందిన నేపథ్యంలో సౌదీ అరేబియాలో గత శుక్రవారం విడుదలైన ఆ చిత్రాన్ని తమ దేశంలో ప్రదర్శించరాదని యుఎఇ జాతీయ ప్రసార సంస్థ ఆదేశించినట్లు గల్ఫ్‌న్యూస్‌ వార్తా సంస్థ వెల్లడించింది. ఈ తాజా...
"గజిబిజి" ట్రైలర్ మీకోసం
Webdunia11 గంటల క్రితం
అలీ, వేణుమాధవ్ హీరోలుగా, ఫర్జానా హీరోయిన్‌గా కె.వాసు స్వీయ దర్శకత్వంలో నిర్మిస్తున్న చిత్రం ‘గజిబిజి’. గాయత్రి ఆర్ట్స్ పతాకంపై తెరకెక్కనున్న సినిమా గురించి దర్శకుడు కె.వాసు మాట్లాడుతూ పాత్రల మధ్య ఉండే గజిబిజినుండి వినోదం పుడుతోందని, పగతో సాధించేది ఏమీ లేదని, ప్రేమతో దేన్నైనా సాధించవచ్చుననే సందేశంతో ఈ సినిమా ఉంటుందని అన్నారు.ఆద్యంతం వినోదంగా సాగే ఈ సినిమాను ప్రేక్షకులు పెద్ద ఎత్తున ఆదరిస్తారని దర్శకుడు ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రతీ ఒక్కరూ తమ రోజువారి పనులతో అలసిపోతుంటారని, అలాంటి వారికి తమ సినిమా...
 ఇతర
తారక రాముని నామ స్మరణలో పార్టీలు
Webdunia12 గంటల క్రితం
సంవత్సరం మార్చి 29, ఆంధ్ర రాజకీయాలలో పెను సంచలనం సృష్టించిన రోజు. ఎందుకంటే నాడు స్వర్గీయ నందమూరి తారకరామారావు తెలుగుదేశం పార్టీని స్థాపించి "తెలుగువారి ఆత్మగౌరవం" నినాదంతో కాంగ్రెస్ పార్టీని మట్టికరిపించి ముఖ్యమంత్రి పదవిని అధిష్టించారు. ఆ తర్వాత ఆంధ్ర రాష్ట్రాన్ని ప్రగతిపధంలో నడిపించేందుకు ఆయన ఎన్నో పధకాలను ప్రవేశపెట్టారు. దురదృష్టవశాత్తూ ఆ తర్వాత ఆయన పదవీచ్యుతిని గావింపబడటం, అనంతర పరిణామాలు.. చివరికి ఆయనను మరణానికి చేరువ చేశాయి.ఈ పరిణామాలలో ఆయన అల్లుడు నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి పదవిని అధిష్టించారు.
ఉద్యమాలే ఊపిరిగా...!
Webdunia14 గంటల క్రితం
కెప్టెన్ లక్ష్మీ సెహగల్‌గా సుపరిచితురాలైన ఈమె జీవితమంతా ఉద్యమాలతోనే గడిచిందనడంలో ఏమాత్రం సందేహం లేదు. నేటికీ ఈమె విసుగూ విరామం లేకుండా పేద, దిగువ మధ్యతరగతి మహిళలకు వైద్యసేవలందిస్తోన్న తొంభై నాలుగేళ్ల సెహగల్ భారత రాష్ట్రపతి పదవికి పోటీచేసిన తొలి మహిళగా గుర్తింపుపొందారు.ఇండియన్ నేషనల్ ఆర్మీ"లో కెప్టెన్‌గా, రాజ్యసభ సభ్యురాలిగా, "ఆల్ ఇండియా డెమొక్రటిక్ ఉమెన్స్ అసోసియయేషన్ (ఐద్వా)" ఉపాధ్యక్షురాలిగా వివిధ స్థాయిలలో పలు భాధ్యతలు నిర్వహించిన లక్ష్మీ సెహగల్ పూర్తిగా సామాజిక సేవకు అంకితమయ్యారు.1947వ సంవత్సరంలో...
మంచి ఆహారంతో ఎనీమియాకు దూరం...!
Webdunia1 రోజుల క్రితం
ప్రస్తుతం మహిళలను వేధిస్తోన్న సమస్య ఎనీమియా (రక్తహీనత). లేచింది మొదలు గొడ్డు చాకిరీ చేసే మహిళలకు రోజంతా పనితోనే సరిపోతుంటే ఇక తినేందుకు సమయమెక్కడ ఉంటుంది చెప్పండి. ఒకవేళ ఉన్నా ఆ ఏం తింటాలే అని ఊరుకునే మహిళలు ఎంతమందో..! దీని ఫలితమే రక్తహీనత.తాజా కూరగాయలలో పాలకూర, క్యారట్, ముల్లంగి, బీట్‌రూట్, టమోటాలలోనూ ఇక పండ్ల విషయానికొస్తే అరటిపండు, యాపిల్, ద్రాక్ష, ఆప్రికాట్‌లలోనూ ఐరన్ అధికంగా లభిస్తుంది. అరటిలో ఉండే ఫోలిక్ ఆసిడ్, బి12 విటమిన్‌లు రక్తహీనత నివారణకు ఎంతగానో ఉపయోగపడుతుందిఅంతేగాకుండా వారు తీసుకునే...